స్టార్ నటి రకుల్ ప్రీతిసింగ్ భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ గా ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ సిద్ధార్థ మల్హోత్రా, కలిసి నటించిన చిత్రం థ్యాంక్ గాడ్.


సినిమా ఇటీవలే విడుదల ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది మరీ. ఇక ఈ సినిమా లో నటి రకుల్ ప్రీతి సింగ్ పాత్రకు పెద్ద ఎత్తున ప్రముఖుల నుంచి ప్రశంసలు  బాగనే అందుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా చూసిన రకుల్ తల్లిదండ్రులు సైతం ఆమెకు ఫోన్ చేసి తనని అభినందించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.

థ్యాంక్ గాడ్ సినిమా చూసిన తన తల్లిదండ్రులు అర్ధరాత్రి సమయంలో తనకు ఫోన్ చేశారని రకుల్ ఇలా వెల్లడించారు.ఈ సందర్భం గా నాన్న ఫోన్ చేసే ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించానని తనపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఇప్పటివరకు తాను నటించిన సినిమాలలో ఉత్తమ సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని నాన్న సినిమాపై ప్రశంసలు కురిపించినట్టు రకుల్ మీడియా కు ఇలా తెలిపారు.ఈ సినిమా భారతీయ కుటుంబాలకు సంస్కృతికి చాలా దగ్గరగా ఉందని నాన్న ప్రశంసలు కురిపించారని రకుల్ తెలిపారు.

ఇక నాన్న నాతో మాట్లాడి సినిమాపై ప్రశంసలు కురిపించిన అనంతరం డైరెక్టర్ నెంబర్ తీసుకుని తనకి కూడా ఫోన్ చేసి ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు దర్శకుడికి సైతం కృతజ్ఞతలు తెలియజేశారుఅంటా రాకుల్ ననాగారు, అంటూ ఈ సందర్భంగా థ్యాంక్ గాడ్ సినిమా పట్ల తన తల్లిదండ్రులు స్పందించిన తీరును  ఆమె తెలియజేశారు.ఇక ఈ సినిమాని ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చూసినప్పుడు వారి నుంచి వచ్చిన స్పందన చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యానంటూ ఈ సందర్భంగా రకుల్ ప్రీతిసింగ్ తన సినిమా గురించి ఇలా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: