ఏదిఏమైనా ఈ మార్పు ముఖ్యంగా పని రోజుల్లో ఎవరైతే వారి చెక్కులను క్లియర్ చేసుకునే అలవాటు ఉందో, ఆ వ్యక్తుల పై ఇది చాలా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా సెలవు దినాల్లో కూడా వారి చెక్కులను క్లియర్ చేసుకోవడానికి పూర్తి అవకాశాలను కల్పించడం జరిగింది. మీ పనులు వేగవంతంగా సాగాలి అంటే, ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాలో కనీసం బ్యాలెన్స్ ను ఉంచుకోవాలి .అప్పుడే వేగవంతమైన చెక్కు క్లియర్ అవుతుంది అని అధికారులు వెల్లడించారు.
మీ చెక్కు గనక చాలా వేగంగా ప్రాసెస్ చేయబడుతుంది అంటే బౌన్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.అలాంటి సందర్భాలలో మీరు పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీ చెక్ బౌన్స్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా మీ ఖాతాల్లో కనీస మొత్తాన్ని ఎప్పుడూ ఉండేలా చూసుకోవడం అవసరం. వారం చివరి రోజులలో అలాగే సెలవు దినాల్లో కూడా చెక్కులు క్లియర్ చేయబడతాయి కాబట్టి, మీ ఖాతాలో డబ్బులు ఉంచుకోవాలి. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు బ్యాంకింగ్ ప్రక్రియలో ప్రధాన మార్పు అని చెప్పవచ్చు. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు అందరికీ చాలా బాగా వర్తిస్తున్నాయి అని కూడా బ్యాంకు కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.