టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ మద్య పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో తీసిన ‘అజ్ఞాతవాసి’ మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఫెయిల్యూర్ కి డైరెక్టర్ దే బాధ్యత అని పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై నానా రకాలుగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో అరవింద సమేత తో మంచి విజయం అందుకున్నారు. ఫ్యాక్షనీజానికి సరికొత్త నిర్వచనం ఈ మూవీతో అందించారు. తాజాగా అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో త్రివిక్రమ్ - బన్నీ కసి బాగా కనిపిస్తుంది.
ఇద్దరికీ మంచి హిట్ కవాలని తీసిన సినిమాలా ఉంది. ఎక్కడ ఏ డ్యామేజ్ లేకుండా కథ, క్యారెక్టర్స్, సంగీతం అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మూవీ మొదట లిరిక్స్ రిలీజ్ చేశారు.. అప్పటి నుంచి రికార్డుల మోత మోగుతూ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని, ఇక ఇంటర్వెల్ బ్లాక్ సూపర్బ్ అనిపించేలా ఉందంటున్నారు. ఇక త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పంచులు బాగా పేలాయని అంటున్నారు అభిమానులు. ఇక సినిమాలో బన్ని తర్వాత మురళీశర్మ పాత్ర బాగుందని, తండ్రి పాత్రలో ఇరగాదీశాడని అంటున్నారు. సినిమాలో హీరోయిన్స్ ఇద్దరు గ్లామర్ షోకి మాత్రమే పరిమితం అయ్యారని అంటున్నారు.
ఫ్లాట్ నరేషన్ తో సినిమా సాగిందని అంటున్నారు. సముద్రఖని, సుశాంత్, వెన్నల కిశోర్, నవదీప్, రాహుల్ రామకృష్ణ లాంటి లాంటి నటులతో ఏ రేంజ్ లో యాక్టింగ్ రాబట్టాలో అలా రాబట్టారని అందులో త్రివిక్రమ్ స్టైల్ చూపించారని అంటున్నారు అభిమానులు. తమన్ అందించిన పాటలు స్క్రీన్ పైన బాగున్నాయని అంటున్నారు. నేపధ్య సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయిందని అంటున్నారు. మొత్తానికి ‘అల వైకుంఠపురములో’ మూవీతో త్రివిక్రమ్, బన్ని దుమ్మురేపారని అంటున్నారు ఆడియన్స్.