క్రేజీ హీరోయిన్ సమంత ఏవిషయం పై అయినా ఎటువంటి మొహమాటం మాట్లాడటమే కాకుండా వీలైనంత వరకు నిజాలు మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తరువాత కుడా సమంత క్రేజ్ ఏ మాత్రేం తగ్గలేదు అన్న విషయం లేటెస్ట్ గా  హైదరాబాద్ టైమ్స్ నిర్వ హించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ కేటగిరిలో సమంత మొదటి స్థానం దక్కించుకుని ఆమె తన రేంజ్ ఏమిటో మరోకసారి అందరికి తెలిసేలా చేసింది.

ఇండస్ట్రీ టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న పూజ హెగ్డే రష్మికలు    ఈ సర్వేలో 5వ స్థానం 9వ స్థానాలతో పరిమితం అయితే సమంత టాప్ వన్ పొజిషన్ కు ఎంపిక కాబడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమంత ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. 


మహానటి సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు తన జీవితంలో కూడ జరగబోతే తానూ తెలివిగా తప్పించుకున్నాను అంటూ కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో తన గత ప్రేమ గురించి ఇన్ డైరెక్ట్ గా  మాట్లాడుతూ ‘సావిత్రి లాగానే నేను కూడా ఒకానొక సమయంలో క్రైసిస్ లో పడ్డాను. ఆ బంధం సరైనది కాదని ప్రారంభంలోనే రియలైజ్ అయ్యాను. దీనితో త్వరగా కోలుకుని దాన్నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత నాగచైతన్య వంటి మంచి భర్త దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. తను అన్ని విషయాల్లో జెమ్స్’ అంటూ తన అనం దాన్ని వ్యథ పరిచింది.  


ఇప్పుడు అన్న మాటలు ఒకనాటి ఆమె మాజీ ప్రేమికుడు సిద్ధార్థ్ ను దృష్టిలో పెట్టుకుని సమంత కామెంట్ చేసి ఉంటుంది అంటూ చాలామంది అభిపరాయ పడుతున్నారు. ‘మహానటి’ సావిత్రి కూడా జెమినీ గణేషన్ ని ప్రేమించి అతడి మూడవ భార్యగా మారిన విషయం తెలిసిందే. ఆ తరువాత వారిద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలతో సావిత్రి జీవితం నాసనం అయిపోయింది. అలాంటి దురదృష్టం గుమ్మలోకి వెళ్ళి నష్టపోకుండా తెలివిగా బయట పడినందుకు ఆనంద పడుతూ సమంత ఈ విధంగా కామెంట్ చేసి ఉంటుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: