ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇండియాలో చాపకింద నీరులా తన ప్రతాపం చూపిస్తుంది. ఇప్పటికే మూడు వారాలుగా లాక్ డౌన్ ప్రకటించినా సరే వైరస్ బారిన పడిన వారి సంఖ్యా రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దేశ ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతున్నా సరే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశం మొత్తం లాక్ చేశారు. అయితే కరోనా వైరస్ చైనా కావాలనే స్ప్రెడ్ చేసింది అన్న వార్తలు కొన్ని బయటకు వచ్చాయి. వుహాన్ లోని బి.ఎస్.ఎల్-4 ల్యాబ్ నుండి ఈ వైరస్ బయటకు వచ్చినట్టు చెబుతున్నారు. 

 

అయితే ఈ వార్తలపై స్పందించారు యువ హీరో నిఖిల్. కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని.. చైనాలోని వుహాన్ నగరంలో వైరస్ రాగా అక్కడ నుండి చైనా ఇతర ప్రాంతాలకు డొమెస్టిక్ ఫ్లయిట్స్ ఆపేసింది. కానీ ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ మాత్రం నడిపింది. చైనా కావాలనే ఈ వైరస్ ను ప్రపంచం మీదకు వదిలిందని అనుమానం వ్యక్తం చేశాడు నిఖిల్. ఇప్పటికి కూడా ఆ వైరస్ జంతువుల నుండి పుట్టిందా.. లేక వుహాన్ ల్యాబ్ లో దాన్ని తయారు చేశారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. 

 

కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వారికి సాయం అందించడంలో నిఖిల్ ముందుకొచ్చారు. ఇప్పటికే కొంతమందికి మాస్కులు, శానిటైజర్లు అందించిన నిఖిల్ సిసిసికి ఆర్ధిక సాయం కూడా అందించారు. రీసెంట్ గానే నిఖిల్ డాక్టర్ పల్లవితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. అసలైతే ఈరోజు అనగా ఏప్రిల్ 16న నిఖిల్ పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పెళ్లి వాయిదా వేసుకున్నాడు నిఖిల్. ఇక సినిమాల విషయానికి వస్తే నిఖిల్ 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాల్లో నటిస్తున్నారు. రెండు సినిమాలు క్రేజీ ప్రాజెక్టులు కాగా కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: