ఈటివిలో జబర్దస్త్ లో కమెడియన్ గా పరిచయమై దానిలో కామెడీ చేస్తూనే పలు షోలకు యాంకర్ గా కొనసాగుతున్నాడు సుడిగాలి సుధీర్. యాంకర్ గా తను చేసే కామెడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈమధ్య అతను హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. బుల్లితెర మీద వరుస షోలతో బిజీగా ఉండే సుధీర్ కరోనా బారిన పడినట్టు టాక్. సుధీర్ కు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది.

కొద్దిరోజులుగా సుధీర్ సిక్ అవడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందట. అయితే ఈ విషయాన్ని సుధీర్ అధికారికంగా వెల్లడించలేదు. సుధీర్ దసరా స్పెషల్ షో అక్కా ఎవరే అతగాడు షోలో పాల్గొన్నాడు. ఆ షోలో దాదాపు చాలామంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఆదివారం నాడు సుధీర్ కు కరోనా టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చిందట. ప్రస్తుతం అతను హోం క్వారెంటైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

సుధీర్ పాల్గొన్న షో దసరాకి టెలికాస్ట్ అవుతుంది. అయితే సుధీర్ ఆ షో ద్వారా ఎంతమందికి కరోనా అంటించి ఉంటాడు అన్నది మాత్రం ఇప్పుడు తెలియదు. బుల్లితెర మీద అత్యధిక పారితోషికం తీసుకుంటున్న యాంకర్ గా సుధీర్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. సుధీర్ కు కరోనా అన్న వార్తలపై అతని సన్నిహితులు కూడా స్పందించలేదు. అయితే సుధీర్ కు కరోనా పాజిటివ్ అన్న వార్తలు మాత్రం నిజమే అని గట్టిగా చెబుతున్నారు. సుధీర్, రష్మి కలిసి చాలా రకాల షోస్ చేస్తున్నారు. సుధీర్ కు కరోనా అని తెలియగానే అతనికి క్లోజ్ గా ఉన్న రష్మి కూడా దానికి ఎఫెక్ట్ అయ్యిందా లేదా అన్న టెన్షన్ లో ఉన్నారు వారి ఫ్యాన్స్.                                    

మరింత సమాచారం తెలుసుకోండి: