బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏకైక దర్శకుడు రాజమౌళి.. ఒక్క సినిమాతోనే మన తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు దానికి మించి టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, చరణ్ లతో rrr అనే మరో పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇటీవల రాజమౌళి విడుదల చేసిన కొమురం భీం టీజర్ ఇప్పుడు అందరిలో విశేష స్పందనను రాబట్టింది. ఇదిలా ఉంటె ఇప్పుడు తాజాగా మన జక్కన స్నేహితుడు మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన మరెవరో కాదు నిర్మాత  సాయి కొర్రపాటి.. ఒకప్పుడు టాలీవుడ్లో మార్మోగిన పేరు. 'ఈగ' లాంటి సెన్సేషనల్ మూవీతో నిర్మాతగా అరంగేట్రం చేశాడాయన. 


సాయి రాజమౌళికి ఆప్త మిత్రుడు అన్న సంగతి తెలిసిందే. 'ఈగ' తర్వాత రాజమౌళితో కలిసి 'అందాల రాక్షసి' సినిమాను నిర్మించాడు సాయి.సాయి నిర్మించే సినిమాలకు తరచుగా జక్కన్న అతిథిగా వచ్చేవాడు. ఆ సినిమాలను ప్రమోట్ చేసేవాడు. వీళ్లిద్దరి బంధం గురించి టాలీవుడ్లో అందరికీ తెలుసు. ఐతే ఒక దశలో వరుసగా వినూత్నమైన సినిమాలు నిర్మిస్తూ మంచి పేరు సంపాదించిన సాయి..తర్వాత వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో ప్రొడక్షన్ ఆపేశాడు.ఐతే కొంత విరామం తర్వాత ఆయన ప్రొడక్షన్లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. ఐతే ఈసారి కూడా ఆయన రాజమౌళి ఫ్యామిలీతోనే అసోసియేట్ అవుతున్నారు. కీరవాణి చిన్న కొడుకు సింహాను కథానాయకుడిగా పెట్టి సినిమా తీయబోతున్నాడట. 


ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడట. కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడట.

సింహా హీరోగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైంది ఒకే సినిమాతో. అదే.. మత్తు వదలరా. ఈ సినిమా తర్వాత కాలభైరవ సంగీత దర్శకుడిగా వరుసగా సినిమాలు చేసుకుపోతుండగా.. సింహా మాత్రం తర్వాత ఏ చిత్రం చేయలేదు. వీళ్లిద్దరితో కలిసి సాయి రంగంలోకి దిగుతున్నాడు. మరీ రీఎంట్రీలో అయినా ఆయనకు మంచి ఫలితాలొస్తాయేమో చూడాలి.ఒకవేళ తను నిర్మించే ఈ కొత్త ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే ..ముందు ముందు రాజమౌళి రాబోయే సినిమాల్లో కూడా సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: