మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన సినిమా అలవైకుంఠపురములో. గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా పూజాహెగ్డే నటించగా పలు కమర్షియల్ హంగులు కలిపి ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు త్రివిక్రమ్ ఎంతో అద్భుతంగా దీనిని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలోని పాటలు జాతీయ స్థాయిలో ఎంత గుర్తింపుని అందుకుని ముందుకు దూసుకెళ్లాయో మనకు అందరకూ తెలిసినదే.  

ఇకపోతే దీని తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న సినిమాకు దర్శకత్వం వహించనున్నారు త్రివిక్రమ్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ అనంతరం ఈ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హారిక హాసిని క్రియేషన్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ప్రతిష్టాత్మక చిత్రం అలానే ఆ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా అలానే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లతో మరొక రెండు సినిమాలు కూడా త్రివిక్రమ్ చేయనున్నారని ఇప్పటికే ఆయా సినిమాలకు సంబంధించిన కథలు చాలావరకూ పూర్తయ్యాయని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి.  

అయితే తన తదుపరి సినిమాల విషయమై అతి త్వరలో స్వయంగా త్రివిక్రమే మీడియా వారికి అన్ని వివరాలు తెలియ పరుస్తారు అని అప్పటివరకు ఆయన తదుపరి సినిమాలు వాటి వివరాలకు సంబంధించిన ప్రచారం అవుతున్న వార్తల గురించి ఏవిధంగా నమ్మవద్దని ఆయన సన్నిహితులు చెప్తున్నారట. మరి ప్రస్తుతం త్రివిక్రమ్ కెరీర్ లైనప్ చూస్తుంటే రాబోయే సినిమాలతో వరుసగా పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలు ఆయన లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: