కొన్ని కామెడీ షోలు చూస్తే కొద్దిగా అతి అయ్యిందని అనిపిస్తుంది. జబర్దస్త్ ను బీట్ చేయాలన్న ఉద్దేశంతో పెట్టిన అదిరింది మొదటి సీజన్ పెద్దగా క్లిక్ అవలేదు. అందుకే దానికే బొమ్మ యాడ్ చేసి బొమ్మ అదిరింది అంటూ శ్రీముఖి, పండుని యాడ్ చేసి షో చేస్తున్నారు. ప్రోగ్రాం సక్సెస్ చేసేందుకు కామెడీ అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా సద్దాం కామెడీలో కొన్నిసార్లు శృతిమించుతుందని చెప్పొచ్చు.

లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో శ్రీముఖి మీద షాకింగ్ కామెంట్ చేశాడు సద్దాం. తను చేసే స్కిట్ లో రాజు గెటప్ వేసిన సద్దాం శ్రీముఖి నా మొదటి పెళ్లాం అనేశాడు. దానికి ఆమె కూడా షాక్ అయ్యింది. అయితే దాన్ని కవర్ చేసేందుకు ఈశాన్యంలో బరువు ఉండాలని అన్నారు అందుకే ఆమెను అక్కడ పెట్టానని అన్నాడు సద్దాం. ఇవి నిజంగా ఆడియెన్స్ ను నవ్వించేందుకు వేసే జోకులేనా అని కొందరు అనుకుంటున్నా కామెడీ కోసమేగా లైట్ తీసుకోవాలని కొందరు అంటున్నారు.

ఫైనల్ గా బొమ్మ అదిరింది ప్రోమో కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశారు. చూస్తుంటే ఈ వారం ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించేలా ఉన్నారు. శ్రీముఖి మీద సద్దాం ఆ పంచ్ వేసినా ఆమె మాత్రం పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుని నవ్వి ఊరుకుంది. యాంకర్ గా చేస్తున్నందుకు ఇలాంటి కామెంట్స్ విని విని శ్రీముఖికి కూడా అలవాటు అయినట్టు ఉంది.    

                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: