ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'ఉప్పెన'..ఎన్నో భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల అయ్యింది.. ఇక ఇప్పటికి ఈ సినిమా విడుదల అయ్యి 11 రోజులు అయినా కాని  కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు.రెండో వీకెండ్ కూడా ఈ చిత్రం అసాధారణమైన కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.ఇక ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. 'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు, హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ వంటివి మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి. దాంతో ఈ చిత్రానికి రికార్డ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.దాంతో 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన ఈ చిత్రం 11రోజులైనా కూడా జోరు చూపిస్తూనే ఉంది.



ఇక ఈ సినిమా ఇప్పటిదాకా ఎంత వరకు రాబట్టిందంటే...'ఉప్పెన' చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే ఫినిష్ చేసిన ఈ చిత్రం .. 11 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 44.96 కోట్ల షేర్ ను రాబట్టి స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. రెండో సోమవారం కూడా 1.17 కోట్ల షేర్ పైనే రాబట్టడం ట్రేడ్ ను సైతం షాక్ గురి చేసింది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: