తెలుగు డైరెక్టర్ సుజీత్ తన కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ తీసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఆ తరువాత దర్శకుడిగా మారి శర్వానంద్ తో ‘రన్ రాజా రన్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో ఆ వెంటనే ప్రభాస్ తో ‘సాహో’ వంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించే ఛాన్స్ కొట్టేసాడు. అయితే ఆ అవకాశాన్ని ఈ కుర్ర డైరెక్టర్ పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ నటించే సినిమా పై ఎన్నో అంచనాలు ఉంటాయి.. వాటిని ఇతను బ్యాలన్స్ చెయ్యలేకపోయాడు.

అయినప్పటికీ ప్రభాస్ కి వున్న క్రేజ్ తో సాహో బాలీవుడ్లో బాగానే హిట్ అయ్యింది.ఇక అప్పటికి తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ సుజీత్ కు వరించింది. కానీ అతనికి పెళ్లి కుదరడం వలన ఆ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు. తరువాత గోపీచంద్ తో కూడా ఓ సినిమా చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే గోపి ముందుగా 3 సినిమాలను పూర్తి చెయ్యాల్సి ఉంది. ఈ గ్యాప్లో ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నాడో ఏమో.. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకోని పెద్ద షాక్ ఇచ్చాడు..


ఇక ఇటీవల ఈ మధ్యనే విక్కీ కౌశల్ కు సుజీత్ ఓ స్క్రిప్ట్ వినిపించాడట.ఇది పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.ఇక ఈ కథ విక్కీకి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. ‘జీ స్టూడియో’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని సమాచారం.అన్నీ అనుకున్నట్టు జరిగితే.. 2022లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అందుతుంది.. ఇక ఈ చిత్రంతో ఎలా అయిన పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలీవుడ్ లో జెండా పాతెయ్యాలని చూస్తున్నాడట సుజిత్. ఇక చూడాలి ఈ యువ డైరెక్టర్ ఎలాంటి హిట్ కొడతాడో.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: