ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా తో భారీ సక్సెస్ ని అందుకోవడంతో పాటు అందులోని సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ ని దక్కించుకున్నాడు యువ సంగీత దర్శకుడు థమన్. ఇక ఆ మూవీలో బుట్ట బొమ్మ, రాములో రాముల, సామజవరగమనా సాంగ్స్ అయితే యూట్యూబ్ లో వందల మిలియన్ల వ్యూస్ దక్కించుకోవడంతో పాటు యువత నుండి విశేషమైన స్పందనని అందుకున్నాయి. దాని తరువాత ఒక్కసారిగా అటు జాతీయ స్థాయిలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా గొప్ప పేరు దక్కించుకున్న థమన్ చేతిలో ప్రస్తుతం చాలానే సినిమాలు ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ కమర్షియల్ మూవీ సర్కారు వారి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న అయ్యప్పనుం కోషియం మూవీ రీమేక్, బాలయ్య మరియు బోయపాటి ల కలయికలో తెరకెక్కుతున్న బిబి3 మూవీ, అలానే పవర్ స్టార్ హీరోగా వేణు శ్రీరామ్ తీస్తున్న వకీల్ సాబ్, యువ నటుడు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సినిమాలకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఎప్పటినుండో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాలి అనే ఆయన కల త్వరలో నెరవేరే ఛాన్స్ వచ్చింది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి, దాని తరువాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో నటించనున్న విషయం తెల్సిందే. ఇటీవల ఈ మూవీ యొక్క అధికారిక పూజా కార్యక్రమాలు జరిగాయి. కాగా ఈ మూవీ కి సంగీత దర్శకుడి గా ఇటీవల యూనిట్ థమన్ పేరు ని అనౌన్స్ చేసింది. ఇక నిన్న తన అభిమానులతో జరిగిన సోషల్ మీడియా చిట్ చాట్ లో భాగంగా థమన్ మాట్లాడుతూ, తాను ఎన్నో ఏళ్ళు గా ఎదురుచూస్తున్న అవకాశం వచ్చిందని, తొలిసారిగా మెగాస్టార్ మూవీకి పని చేస్తుండడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని చెప్పిన థమన్, ప్రస్తుతం ఆ మూవీ కి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతున్నాయని అన్నాడు. దానితో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. మరి తొలిసారిగా చిరంజీవి తో థమన్ చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: