టాలీవుడ్ లో దర్శకుడు త్రివిక్రమ్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తెరకెక్కించే సినిమాలు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు గా తెరకెక్కుతాయి. ఆ తరహా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి త్రివిక్రమ్ సినిమాలు. అయన సినిమాల్లో ఎన్నో స్పెషల్స్ ఉన్నట్లే.. ప్రతి సినిమాలోనూ ఒక సీనియర్ హీరో పాత్ర ఉండటం మనం చూడొచ్చు. ఆ విధంగా కొరటాల శివ కూడా తన రాబోయే చిత్రం లో ఓ పవర్ ఫుల్ పాత్రలో సీనియర్ హీరోయిన్ ను తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

కొరటాల శివ ఎన్టీఆర్ తో తన తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్సినిమా లో స్వాతంత్ర సమర యోధుడు కొమురం భీం పాత్రలో నటించబోతున్నారు.  రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు గా ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు.  మరోవైపు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించారు.

 అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు దీంతో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. వీరి కాంబో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఐదేళ్ల కిందట వచ్చి సంచలన విజయం సాధించింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ పై ఎంతో క్రేజ్ ఉండగా ప్రస్తుతం వీరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అనగానే  ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో ఖుషి అవుతున్నారు.  ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్ మరియు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొరటాల శివసినిమా ని కాలేజీ పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  ఒక విద్యార్థి నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతుంది.. ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో లేడీ పొలిటికల్ లీడర్ పాత్ర ఉండబోతుందట.  ఎన్టీఆర్ తో సరిసమానంగా ఉండే ఈ పాత్ర కోసం విజయశాంతి తీసుకోవాలని అనుకుంటున్నారట..  రమ్యకృష్ణ కూడా ఈ లిస్టులో ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: