కే జి ఎఫ్ సినిమా తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన తదుపరి చిత్రంగా ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తి చేసుకుంది అని తెలుస్తోంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ పార్ట్ 2 త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సలార్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అనేక రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. సినిమా కథ, కాస్టింగ్ గురించి రోజుకో మాట వినిపిస్తూనే ఉంది. వీటి మీద ఇప్పటి వరకు చిత్ర బృందం స్పందించలేదు. చాలా వరకు ఇవి నిజమవుతాయని అందరూ అనుకుంటున్నారు. అలా నిజమైతే బాగుండు అని అభిమానులు అనుకునే ఓ పుకారు ప్రభాస్ డ్యుయల్ రోల్ చేయడం. ఈ సినిమాలో  ప్రభాస్ మరో లుక్ కూడా ఉందట. దానిని సినిమాలోనే రివీల్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రేక్షకులకు సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందట. చిత్రబృందం ఇప్పుడే క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అభిమానులు ఇది కూడా పుకారే అనుకుంటున్నారు.

మరికొంతమంది ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తే అంత బాగుండదు. ప్రశాంత్ రిస్క్ చేస్తున్నాడని కూడా అంటున్నారు. గత అనుభవాలు ప్రభాస్ కు అంతగా మంచి ని ఇవ్వలేదు. దాంతో ప్రభాస్ సినిమా మీద వస్తున్న ఈ పుకారు పుకారు అయితే బాగుంటుందని అనుకుంటున్నారు.ఇకపోతే రెండో ప్రభాస్ చూసేటప్పుడు వచ్చే రెస్పాన్స్ మాత్రం మంచి అదిరిపోతుందని అంటున్నారు చిత్ర బృందం. మరి ఇది నిజమా.. రూమరా.. అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.. ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఆయన హీరోగా మరో రెండు పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ సినిమా చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: