టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు తమన్. ప్రస్తుతం ఆయన చేతుల్లో టాలీవుడ్ టాప్ హీరోల అందరి సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలోని ప్రతి మెగా హీరో సినిమా ప్రస్తుతం తమన్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ దాకా  ఆయన సినిమాలను ఒకేసారి చేస్తూ టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. అలా వైకుంఠపురం తో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుని టాలీవుడ్ లో ఏ సంగీత దర్శకుడికి అందని రేంజ్ కి ఎదిగిపోయాడు.

ప్రస్తుతం తమన్ కెరీర్ పీక్స్ లో ఉందని చెప్పవచ్చు. ప్రతి స్టార్ హీరోకి తమనే మ్యూజిక్ డైరెక్టర్ గా కావాలి ఆ విధంగా ఆయన మెగా హీరోలకు వరుస సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లూసిఫర్ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అదే కాకుండా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేదలాం సినిమా రీమేక్ కి కూడా తమనే సంగీతం అందించబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పనుం రీమేక్ కి కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన వకీల్ సాబ్ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. 

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నారట. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కు స్పెషల్ సినిమా అవుతుందని అంటున్నారు. ఇక మంచి స్నేహితులుగా టాలీవుడ్ లో బావా బావా అనుకుంటూ తిరుగుతారు మరియు సాయి ధరమ్ తేజ్. సాయి తేజ సినిమాలలో ఎక్కువ సినిమాలు తమన్ సంగీతం అందించగా ప్రస్తుతం చేస్తున్న రిపబ్లిక్ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఆ తర్వాత రాబోయే చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: