ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం యూరోప్ లో జరుగుతోంది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ఇద్దరు హీరోల టీజర్స్ అలానే దోస్తీ సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. కాగా ఈ భారీ పాన్ ఇండియా సినిమాని ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మూవీ తరువాత దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ హీరోగా కె ఎల్ నారాయణ నిర్మించనున్న భారీ సినిమా తీయనున్న రాజమౌళి, దాని అనంతరం మరొక్కసారి బాహుబలి హీరో ప్రభాస్ తో ఒక మూవీ చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.
ఇప్పటికే మహేష్ కోసం స్టోరీ సిద్ధం చేసే పనిలో ఉన్న కథకుడు విజయేంద్ర ప్రసాద్ మరొకవైపు ప్రభాస్ కోసం కూడా ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా విషయమై ఇటీవల ప్రభాస్, రాజమౌళి మధ్య చర్చ జరిగిందని, త్వరలో స్టోరీ సిద్డమైన అనంతరం వీరిద్దరి కాంబో పై పూర్తి వివరాలు బయటకు రానున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త కనుక నిజం అయితే ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి ..... !!