ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈ జనరేషన్ లో మహానటి సావిత్రి అంతటి ఫేమ్ సమంత తెచ్చుకునే అవకాశం కలదు. ఆమెకు ఆ అర్హత ఉందని చెప్పుకొచ్చారు. లెజెండ్ సావిత్రితో పోల్చడం అంటే చిన్న ప్రశంస కాదు. మూడు నాలుగు తరాల హీరోయిన్స్ ని చూసిన సురేష్ బాబు ఆ గౌరవానికి సమంతను ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపోతే సమంత నాగచైతన్యలు విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తల వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నాగచైతన్యకు మేనమామ అయిన దగ్గుబాటి సురేష్ బాబు అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ ఆ విషయం పట్ల అలా స్పందించారు.
సమంత గురించి వాళ్లు నెగిటివ్ గా అనుకుంటున్నాటూ అంటూ అనేక రకాల వార్తలు వినిపించాయి. అ సమయంలో దగ్గుపాటి ఫ్యామిలీ ఆ వార్తల పై స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమే అని చాలామంది విశ్వసించారు. ఇక తాజాగా సురేష్ బాబు సమంతని పొగుడుతూ మాట్లాడిన తీరును బట్టి చూస్తే నాగచైతన్య సమంత దూరమైనందుకు ఆ కుటుంబానికి ఎటువంటి కోపం లేదు అని తేలిపోయింది. మొత్తానికి ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టినట్టు అయింది.. ఆయన మాటలను బట్టి చూస్తే విడాకులు అన్నది వారి వ్యక్తిగత సమస్య కాబట్టి ఎవరిని తప్పు పట్టకూడదు అన్న విధంగా ఆలోచించారు అని అర్థమవుతోంది.