నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పోయిన సంవత్సరం విడుదల అయిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తేరకెక్కుతున్న వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీnలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండగా , దునియా విజయ్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కనుక జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇలా ఈ మూవీ విడుదల కాక ముందే బాలకృష్ణ తన తదుపరి మూవీ ని మొదలు పెట్టేసాడు. బాలకృష్ణ తన తదుపరి మూవీ ని టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందబోతుంది. ఇప్పటికే ఈ మూవీ అధికారికంగా ప్రారంభం కూడా అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి శరత్ కుమార్ నటించబోతున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి , శరత్ కుమార్ , బాలకృష్ణ 108 వ మూవీ లో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ సరసన ప్రియమణి , ప్రియాంక జవల్కర్ లు హీరోయిన్ లుగా నటించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: