బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ రోల్ లో దుమ్ముదులిపేయనున్నారు. పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్న ఈ మూవీపై పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మంచి హైప్ నెలకొంది.కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్కి పవన్ కళ్యాణ్ బిజీగా మారడం వల్ల బ్రేక్ పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ బరిలో దిగిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మళ్లీ మూవీ సెట్స్ లో అడుగుపెడతారో చెప్పలేం. దీంతో హరీష్ శంకర్.. రవితేజతో ఇటీవల సినిమా స్టార్ట్ చేశారు. హిందీ సూపర్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా మిస్టర్ బచ్చన్ సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు.అయితే రవితేజతో హరీష్ శంకర్ సినిమా స్టార్ చేసినప్పుడు.. చాలా మంది పవన్ ఫ్యాన్స్ ఉస్తాద్ గురించి అడిగారు. కానీ మేకర్స్ ఈ విషయంపై స్పందించలేదు.


ఇప్పుడు సడెన్ గా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎక్స్పెక్ట్ ది అన్ ఎక్స్పెక్టెడ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ బాగా ఖుషీ అయ్యారు. ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చి మరింత క్యూరియాసిటీ కూడా పెంచేశారు ఉస్తాద్ మేకర్స్.ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను షేర్ చేసింది మైత్రీ సంస్థ. మార్చి 19 వ తేదీన అనగా రేపు గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ చేసింది. ఖచ్చితంగా రేపు సోషల్ మీడియా బద్దలు కావడం ఖాయం.అయితే పిక్స్ లో పవన్ కళ్యాణ్ తోపాటు హరీష్ కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా లో ఉన్నారు. అంటే పొలిటికల్ మీటింగ్ నుంచి నేరుగా డబ్బింగ్ చెప్పేందుకు వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.అయితే రేపు విడుదల అయ్యే ఈ గ్లింప్స్ లో పొలిటికల్ డైలాగ్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అవి కూడా ప్రభుత్వంపై కౌంటర్ వేసేలా ఉంటాయని సమాచారం. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఎలాంటి సంచలనం సృష్టించనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: