
అయినప్పటికీ జీవీ బాబు ఆరోగ్యం మెరుగుపడలేదు. తాజాగా మరింత విషమించడంతో ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు ఈ విషయం తెలుసుకున్న వేణు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. `జీవీ బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోకే గడిపారు. చివరి రోజుల్లో ఆయనను బలగం మూవీతో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను` అంటూ వేణు పోస్ట్ పెట్టారు.
బలడం టీమ్తో పాటు మరికొందరు సినీప్రముఖులు జీవీ బాబు మృతి పై సంతానం తెలుపుతున్నారు. కాగా, వేణు దర్శకుడుగా పరిచయం అవుతూ ప్రియదర్శి హీరోగా నటించిన `బలగం` చిత్రం 2023లో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ సాధించింది. బలగంలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపుతో పాటు మరిన్ని అవకాశాలు కూడా తలుపు తడుతున్నాయి. రంగస్థలం కళాకారుడు జీవీ బాబు కూడా బలగం మూవీతోనే వెండితెరపై అడుగు పెట్టారు. ఇందులో కథను ముందుకు నడిపించే అంజన్న పాత్రలో ఆయన అలరించారు. తాజాగా జీవీ బాబు మృతిచెందడంతో బలగం చిత్ర బంధం విషాదంలో మునిగిపోయింది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు