ఐకాన్.. అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటిగా అనుకున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాలని భావించారు. అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ ఈ ప్రాజెక్టును ప్రకటించి ఏడేళ్లు అవుతున్న ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈ గ్యాప్‌లో వేణు శ్రీరామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `వకీల్ సాబ్` చిత్రాన్ని తెరకెక్కించి సాలిడ్ హిట్ అందుకున్నాడు. అయిన కూడా ఐకాన్ చేసేందుకు అల్లు అర్జున్ ముందుకు రాలేదు.


ఒక దశలో ఐకాన్ సినిమా ఆరంభం కాకముందే ఆగిపోయింది అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ దిల్ రాజు మాత్రం ఐకాన్ కచ్చితంగా ఉంటుందని గతంలో ఓ సినిమా ఈవెంట్ లో బ‌లంగా చెప్పారు. ఆ తర్వాత ఐకాన్ ఊసే లేదు. మొన్నామధ్య అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీకి ఐకాన్ టైటిల్ అనుకుంటున్నారని.. దిల్ రాజు కూడా టైటిల్ ఇచ్చేయడానికి రెడీ అయ్యారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా `తమ్ముడు` ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారం నిజం కాదని తేలిపోయింది.


డైరెక్టర్ వేణు శ్రీరామ్, నితిన్ కాంబోలో తెర‌కెక్కిన యాక్షన్ డ్రామానే త‌మ్ముడు. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ జూలై 4న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. `పుష్ప కారణంగా ఐకాన్ డిలే అయింది. అందుకే డైరెక్టర్ వేణు తమ్ముడు కథ‌ రెడీ చేశాడు` అని పేర్కొన్నారు. ఈయన మాటలు బట్టి చూస్తే.. ఐకాన్ డిలే అయింది అన్నారు కానీ ఆగిపోయిందని చెప్పలేదు. సో ఐకాన్ ప్రాజెక్ట్‌ ఇంకా ఆన్‌లోనే ఉందన్న సంగ‌తి తేలిపోయింది. మరి ఈ మూవీ చేసేందుకు బ‌న్నీ ముందుకు వస్తాడా? లేదా? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: