ప్రభాస్ ది రాజాసాబ్‌ స్టోరీ విషయంలో ఓ క్లారిటీకి వచ్చేసారు డైరెక్టర్ మారుతి .. ఇక ఇది హారర్ కామెడీ మూవీ అయిన ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉంటాయని చెబుతున్నారు .. ప్రధానంగా ఓ తాతా , నాయనమ్మ , మనవడి మధ్య జరిగే స్టోరీగా ది రాజా సాబ్ రాబోతుందని అంటున్నారు .. అలాగే ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేకింగ్ విషయంలో ఏమాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను పగడ్బందీగా తీసుకురాబోతున్నట్టు చెబుతున్నాడు .. తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది .. ఇక అభిమానులు వింటే ప్రభాస్ ఇస్ బ్యాక్ అంటూ ఆనందపడుతున్నారు . అలాగే చిరు విశ్వంభర షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది ..


ఒక ఐటెం సాంగ్ మిన‌హ‌ షూటింగ్ అంతా పూర్తయినట్టు చిత్ర యూనిట్ చెబుతుంది .. ఇక త్వరలోనే మిగిలిన పోర్షన్ కూడా కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు .. అయితే విశ్వం భరతో పాటు అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఓ కామెడీ సినిమాలో కూడా నటిస్తున్నారు మెగాస్టార్. ఇదే క్రమంలో వరస అప్డేట్లతో హల్చల్ చేస్తుంది పెద్ది టీమ్‌ .. ప్రస్తుతం యాక్షన్స్ సీన్ చిత్రీకరణలో బిజీగా ఉన్న యూనిట్ , అందుకోసం ప్రత్యేకంగా ట్రైన్ సెట్ ను కూడా తయారు చేసుకుంది .. నవకాంత్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్ ను ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు .. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. ఇదే క్రమంలో రిలీజ్ కు ముందే వరుస‌ రికార్డులు క్రియేట్ చేసింది రజినీకాంత్ కూలి .  


లోకేష్ కనగ‌రాజ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున , ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు .. అలాగే అమీర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు .. అయితే ఈ సినిమా ఓవర్‌సీస్‌ రైట్స్‌ 80 కోట్లు ధర పలికాయి .. కోలీవుడ్ సినిమా చరిత్రలోనే ఇది హైయెస్ట్ నెంబర్ గా కావటం మరో విశేషం .. మరో స్టార్ కేజిఎఫ్ హీరో రాకింగ్  స్టార్ యాష్ ప్రస్తుతం హీరోయిన్ కియారా ఆకాశం అతిపెద్ద డెసిషన్ తీసుకున్నారు .. ప్రస్తుతం కియారా ప్రెగ్నెంట్ కావడంతో ఆమె కోసం బెంగళూరులో జరగాల్సిన షూటింగ్‌ను ముంబైకి మార్చుకున్నారు .  కే జి ఎఫ్ 2 తర్వాత చాలా బ్రేక్ తీసుకొని టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు యష్ .. ఇక ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: