టాలీవుడ్ లో ఇటీవల కాలంలో సీక్వెల్స్ ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు సినిమా హిట్ అయితే సీక్వెల్ అనౌన్స్ చేసేవారు. అది కూడా ఆ స్కోప్ ఉన్న చిత్రాలకు మాత్రమే. కానీ ప్రస్తుత రోజుల్లో సినిమా రిలీజ్ కి పొందే సీక్వెల్ ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పేస్తున్నారు. అలాగే ఈ సీక్వెల్స్ రెండు రకాలుగా ఉన్నాయి. కొందరు మొదటి భాగానికి ఏ మాత్రం సంబంధం లేకుండా సీక్వెల్ మూవీలను తీస్తుండగా.. మరికొందరు ఒక కథని రెండు మూడు భాగాలుగా చేసి సీక్వెల్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు.


బాహుబలి తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మరింత ఊపందుకుంది. టాప్ హీరో నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు అందరూ సీక్వెల్స్ వెనుక పరుగులు పెడుతున్నారు. టాలీవుడ్ లో చూసుకుంటే రీసెంట్ టైంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 1`, `పుష్ప 2` చిత్రాలతో భారీ సక్సెస్ అందుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు.


అలాగే బాహుబలి తర్వాత ప్ర‌భాస్ లైన‌ప్ లో `సలార్`, `కల్కి 2898 ఏడీ` సినిమాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల `దేవర` సినిమాతో బిగ్ హిట్ అందుకున్నాడు. అయితే డైరెక్ట‌ర్‌ కొరటాల శివ ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వల్ గా `దేవర 2`ను ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న `హరిహర వీరమల్లు` సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో సీక్వెల్‌ చిత్రాలకు దూరంగా ఉన్నది ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు కాగా.. మరొకరు రాంచరణ్. ఈ ఇద్దరు హీరోలు ఇంతవరకు సీక్వెల్స్ జోలికి పోలేదు. మరి ఇకముందు వెళ్తారా అన్నది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: