
అయితే ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు . ఏంటి..? కారణం అంటూ అభిమానుల్లో చర్చలు మొదలైయాయి. ఈ మధ్య కాలంలో వీల్ళు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండట్లేదు . అసలు అభిమానులతో ముచ్చటించట్లేదు . వాళ్లకు సంబంధించిన ఏ అప్డేట్ ఇవ్వట్లేదు ఏంటి..? కారణం అంటూ ఆరాతీస్తున్నారు అభిమానులు . అయితే అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా పనులు బిజీబిజీగా ఉన్నాడు అంటూ తెలుస్తుంది .
అంతేకాదు స్నేహారెడ్డి కూడా తన బిజినెస్ .. అదేవిధంగా పిల్లల పెంపకం విషయంలో బిజీగా మారిపోయిందట . పైగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . ఏ పాజిటివ్ కామెంట్ పెట్టిన ఏ పాజిటివ్ పోస్ట్ పెట్టిన దాన్ని అర్ధాలు మార్చేస్తూ హాట్ టాపిక్ గా ట్రెండ్ చేస్తున్నారు . ఆ కారణంగానే కొన్నాళ్ళపాటు సోషల్ మీడియాకి దూరంగా ఉంటేనే బెటర్ అన్న నిర్ణయం తీసుకున్నారు ఏమో అంటూ కూడా అభిమానులు మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన పెట్టకపోయినా స్నేహారెడ్డి మాత్రం హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతుంది. అది ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్.. అది ఆమె క్రేజ్ అంటూ అభిమానులు బాగా హైలైట్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఇది నిజంగా అభిమానులు ఎక్స్ పెక్ట్ చేయలేకపోయారు..!!