ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్‌కి మెగా ఫ్యామిలీతో సరైన అనుబంధం లేదని వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కువగా మెగా ఫ్యాన్స్‌–అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాటల యుద్ధాలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఆ ఫ్యాన్స్ మధ్య విభేదాలు పెంచేలా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రవర్తించాడని చర్చ జరుగుతోంది. రీసెంట్ గా  ఒక స్టేజ్ కార్యక్రమంలో పుష్ప సినిమా పాట ప్లే అవుతుండగా దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు ఇతరులు ఆ పాటకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం “నాకు ఇష్టం లేదు..నేను చేయను” అన్నట్లే సైలెంట్‌గా ఉండిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.అదే స్టేజ్ ఈవెంట్‌లో “ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ ఎవరు?” అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన “మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్” అని సమాధానమిచ్చాడు. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.
 

“ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా స్టైలిష్ స్టార్ అనగానే బన్నీ పేరు చెబుతారు. ఇది అందరికి తెలుసు. మరి సాయి ధరమ్ తేజ్ ఎందుకు అలా అన్నాడు?” అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ వేడి చల్లారకముందే మరో వివాదంలో సాయి ధరమ్ తేజ్ ఇరుక్కున్నాడు. పుష్ప పాట ప్లే అవుతుండగా అక్కడ అందరూ ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా, అప్పటివరకు చలాకిగా ఉన్న సాయి ధరమ్ తేజ్ మాత్రం ఆ పాట రాగానే మౌనంగా ఉండిపోయాడు. దీనితో “అల్లు అర్జున్ అంటే ఆయనకి ఇష్టం లేదు, అందుకే ఆ పాటకు డాన్స్ చేయలేదు” అని కొందరు మాట్లాడుకుంటున్నారు.



ఇంతటితో ఆగకుండా, కొంతమంది ఫ్యాన్స్ “సాయి ధరమ్ తేజ్ సినిమాలను బహిష్కరించాలి” అని అంటుంటే, మరికొందరు “అల్లు అర్జున్ గురించి మాట్లాడే స్థాయి కూడా ఆయనకు లేదు” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరోవైపు, “అల్లు అర్జున్ రేంజ్ చూసి మెగా హీరోలు అసూయపడుతున్నారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు” అని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడిప్పుడే చల్లారుతున్న వార్ ని మరీంత హీట్ పెంచేశాడు సాయి ధరమ్ తెజ్. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ దీని ని ఎంత పెద్ద రాధాంతం చేస్తారో..???



మరింత సమాచారం తెలుసుకోండి: