
సినిమా కథలో, స్క్రీన్పై ఎమోషనల్ కంటెంట్ లోపించడం వల్ల లోకేష్ మార్క్ కనిపించలేదని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. కూలీ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్.. టాలీవుడ్ స్టార్ హీరోస్ ప్రభాస్, రామ్ చరణ్లతో సినిమాలకు కమిట్ అయ్యాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయినట్లు తెలుస్తోంది. కూలీ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారంగా, రామ్ చరణ్, ప్రభాస్ ఇద్దరూ ఆయనతో సినిమా చేయడానికి రిజెక్ట్ చేశారని ఓ వార్త టాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో తెలుగు హీరోలు–తమిళ దర్శకుల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి.
రామ్ చరణ్–శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్. మహేష్ బాబు–మురగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్. రామ్ పోతినేని–లింగుస్వామి కాంబినేషన్లో వచ్చిన ది వారియర్. నాగచైతన్య–వెంకట్ ప్రభు కాంబినేషన్లో వచ్చిన కస్టడీ ఇలా వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో, ఇలాంటి రిస్క్ చేయడం అవసరం లేదని ప్రభాస్, రామ్ చరణ్ మనసు మార్చుకున్నట్లు సమాచారం. దాంతో, లోకేష్ కనగరాజ్ ఖాతాలో ఉన్న రెండు మంచి సినిమాలు వెళ్లిపోయినట్లైంది. ఇప్పుడు ఖైదీ 2లో తన సత్తా ఏంటో చూపిస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా ఖైదీ 2పైనే ఆధారపడి ఉంది.