ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ హీరోలు తమ ప్రస్తుత సినిమా షూటింగ్ పూర్తవకముందే, తర్వాతి ప్రాజెక్ట్‌లను కూడా ఫైనల్ చేసేస్తున్నారు. అంటే, ఒక సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరొక సినిమా కి సైన్ చేయడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కానీ, సినీ ప్రముఖుల మాటల్లో ఈ పద్ధతికి రెండు కోణాలు ఉన్నాయి. ఒకవైపు ఇది హీరో కెరియర్‌కి సేఫ్‌గా, ప్లాన్‌డ్‌గా ఉంటుందని అంటారు. ఎందుకంటే, ఒక సినిమా పూర్తవగానే మరో సినిమా మొదలవ్వడం వల్ల హీరోకి గ్యాప్ ఉండదు, మార్కెట్ కంటిన్యూ అవుతుంది. కానీ మరోవైపు మాత్రం ఇది చాలా రిస్క్ అని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే, పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో చాలా మంది నటీనటులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒక హీరో ఒకేసారి రెండు మూడు సినిమాలకు కాల్‌షీట్స్ ఇస్తే షెడ్యూల్స్ గజిబిజిగా మారిపోతాయి. ఫలితంగా సినిమా యూనిట్స్‌కి భారీ గందరగోళం తలెత్తే అవకాశం ఉంటుంది.


ఇప్పుడు ఈ టాపిక్‌పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది ఒక పెద్ద చర్చ — అదే అల్లు అర్జున్‌కి సంబంధించిన తాజా వార్త. మనందరికీ తెలిసిందే, పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్. దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న క్రేజ్, రెమ్యూనరేషన్ లెవెల్ రెండూ సూపర్ హై. ఒక్క సినిమాకే సుమారు 100 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడు అంటూ ట్రేడ్ వర్గాల టాక్. ఇప్పుడు అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎంత పెద్ద స్థాయిలో తెరకెక్కుతుందో ఫిలిం సర్కిల్స్‌లో ఇప్పటికే చర్చ మొదలైంది. భారీ బడ్జెట్, నేషనల్ లెవెల్ కాస్టింగ్, టాప్ టెక్నికల్ టీమ్ — అన్నీ ఈ సినిమా స్పెషల్ హైలైట్స్.



అయితే, ఈ ప్రాజెక్ట్ తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో నటించబోతున్నాడు అనేది సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, అట్లీ సినిమా పూర్తయ్యాక, అల్లు అర్జున్ కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట. ఇది కూడా భారీ స్థాయిలో రూపుదిద్దుకోబోతోందని సమాచారం. ఇదంతా కాకుండా, మరో పెద్ద వార్త కూడా బయటకొస్తోంది. అల్లు అర్జున్ బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక సినిమాకు విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడట. ఈ వార్త వినగానే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పూనకాలు పడ్డారు. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం మరో కోణంలో కామెంట్లు చేస్తున్నారు. “ఎందుకు అల్లు అర్జున్ వరుసగా తమిళ, హిందీ డైరెక్టర్స్‌కే ఛాన్స్ ఇస్తున్నాడు? తెలుగు డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.



ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా లెవెల్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేయడం వలన అల్లు అర్జున్ రేంజ్ మరింత ఎత్తుకు చేరడం ఖాయం. కానీ అదే సమయంలో, తెలుగు డైరెక్టర్స్‌కి అవకాశాలు తగ్గిపోతున్నాయనే చర్చ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఏదేమైనా, ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో “అల్లు అర్జున్ నెక్స్ట్ మూవ్ ఏంటి?” అనేది అత్యంత హాట్ టాపిక్‌గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: