
ఇప్పుడు ఆ లెజెండరీ ఎపిక్ను మరోసారి కొత్త అనుభూతిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఈ కొత్త వెర్షన్లో విజువల్ ప్రెజెంటేషన్, సౌండ్ క్వాలిటీ, కలర్ గ్రేడింగ్ను పూర్తిగా అప్డేట్ చేసి, హాలీవుడ్ స్థాయి అనుభూతి ఇవ్వాలని రాజమౌళి ప్రత్యేకంగా శ్రద్ధ వహించారని సమాచారం. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు 3 గంటల 44 నిమిషాల రన్టైమ్ లాక్ చేయడం విశేషం. అంటే రెండు భాగాలను కలిపినా, కథ ప్రవాహంలో ఎక్కడా విరామం లేకుండా ఒకే ఎపిక్ ఎక్స్పీరియన్స్గా తీర్చిదిద్దారట.
ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి మళ్లీ ఏ స్థాయి మ్యాజిక్ చూపించబోతాడో చూడాలన్న ఆసక్తి పెరుగుతోంది. ఇక ప్రమోషన్లు వేగంగా కొనసాగుతున్నాయి. మేకర్స్ ఈ సినిమాను అక్టోబర్ 31న వరల్డ్వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. మరోసారి ‘బాహుబలి’ మంత్రం తెరపై అలరించబోతోందని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.