
అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కు ఏకంగా 175 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అల్లు అర్జున్ - అట్లీ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం బన్నీ పారితోషం విషయంలో అస్సలు తగ్గకపోవడమే అని తెలుస్తోంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో బన్నీ .. అటు జవాన్ సూపర్ డూపర్ హిట్ అవడంతో అట్లీ రెమ్యూనరేషన్ల విషయంలో అసలు తగ్గట్లేదు అట.
అందుకే వీరిద్దరి పారితోష కాలపై చాలా చర్చల తర్వాత ఈ ప్రాజెక్టును ప్రకటించారు. అలా ఈ సినిమాకు బన్నీకి 175 కోట్ల రూపాయల పారితోషకం ముడుతుంది. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొత్తం 700 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది. ఇందులో 260 కోట్ల రూపాయలను కేవలం గ్రాఫిక్స్ కోసం కేటాయించారట. అలాగే బన్నీ - అట్లీ - దీపిక ఈ సినిమాకు భారీగా పారితో తీసుకుంటున్నారు. సన్ పిక్చర్
బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.