నందమూరి సింహం బాలకృష్ణకు నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘షేర్’ సినిమాపై కోపం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో కాంట్ర‌వ‌ర్సీ విషయాలను సినిమాలలో డైలాగుల రూపంగా మార్చి  కామెడీగా వాడుకోవ‌డం బాగా ఎక్కువ అయింది. అటువంటి డైలాగులు వచ్చినప్పుడు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తూ ఉండటంతో ‘షేర్’ సినిమా విషయంలో కూడా అటువంటి ప్రయోగం చేసారు.

 ఈ సినిమాకు ర‌చ‌యితగా పనిచేసిన డైమండ్ ర‌త్నం వ్రాసిన డైలాగ్ ను నటుడు పృథ్వితో చెప్పించారు. మ‌ల్లిఖార్జున్ దర్శకత్వం వహించిన ఈసినిమాలోని ఈడైలాగ్ ను ఈసినిమా ట్రైలర్ లో ఉoచడంతో మంచి స్పందన వస్తోంది. ‘పోలవరం ప్రాజెక్ట్, వీడి పెళ్ళి, జరిగినట్టే ఉంటాయి, కాని జరగవు చిరాగ్గా’ అన్న డైలాగ్ తెలుగుదేశం పార్టీ అభిమానులను కించ పరుస్తున్నట్లుగా ఉంది అన్న కామెంట్స్ బాలకృష్ణ దృష్టి వరకు వెళ్ళడంతో ఈ డైలాగ్ పై బాలకృష్ణ తన అసహనాన్ని వ్యక్త పరిచినట్లు టాక్. 

దీనితో ఈ డైలాగ్ ను ఫైనల్ ఎడిటింగ్ లో తీసివేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ‘పటాస్’ ద్వారా హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ తాను నిర్మాతగా మారి తీసిన ‘కిక్ 2’ ఘోర పరాజయం చెంది కళ్యాణ్ రామ్ కు తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టిన నేపధ్యంలో ‘షేర్’ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. 

ప‌టాస్ టైప్ లో యాక్ష‌న్ కామెడీగా ఈ సినిమా తెర‌కెక్కింద‌నే వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరుకు భారీ సినిమాల హడావిడి అంతా పూర్తి అయిన తరువాత గర్జించబోతున్న ఈ ‘షేర్’ సక్సస్ కళ్యాణ్ రామ్ కెరియర్ కు చాల కీలకం..  


మరింత సమాచారం తెలుసుకోండి: