ఐదేళ్లుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య  కొరకరాని కొయ్యగా మారిన విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాదానికి తెరపడింది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలు  జస్టిస్‌ డీఎం ధర్మాధికారి ఏకసభ్య కమిషన్‌ జరుపుతూ సుప్రీం కోర్టుకు తుది నివేదికను సమర్పించింది.

 

రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో ఈ వివాదం పై మొదట   హైకోర్టు లో చర్చించిన  తర్వాత ఈ వివాదం  సుప్రీంకోర్టుకు చేరింది.  రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ధర్మాధికారితో ఈ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌ 28న ఏకసభ్య కమిషన్‌ నియమించింది. కమిషన్‌ సైతం దీనికి మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. 

 

ఏంతటికి ఈ విషయం ఒక కొలిక్కి రాకపోవడంతో  స్వయంగా వారే ఉద్యోగుల పంపకాలు జరుపుతూ తుది నిర్ణయం తీసుకుంది. ఈ కేటాయింపులు  ఉద్యోగుల విభజన కోసం జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా జరిపింది.  రెండు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు ఈమార్గదర్శకాల ప్రకారం  స్వీకరించారు.  ఏపీకి తెలంగాణ నుంచి రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లోఆప్షన్లు ఇచ్చిన 613 మందితోపాటు ఆప్షన్లు ఇవ్వని 42మంది కలిపి 655 మంది, 2 రాష్ట్రాలకూ ఆప్షన్లు ఇచ్చిన 502 మందిని తెలంగాణకు కేటాయించింది. 

 

అంతేకాదు ఏపీ నుంచి స్వచ్ఛందంగా రిలీవై, తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న 229 మంది సెల్ఫ్‌ రిలీవ్డ్‌ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించింది. తుది నివేదిక అమలు చేయడానికి, తుది కేటాయింపులకనుగుణంగా పోస్టింగులు పూర్తి చేసేందుకు 4 నెలల గడువు విధించింది. అయితే ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 256 మంది ఉద్యోగుల విషయంలో ధర్మాధికారి కమిషన్‌ నివేదికలో ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదు. దీంతో ఈ 256 మందిని ఏపీకే కేటాయించినట్లయిందని తెలంగాణ ఈ విషయం లో జెన్‌కో డైరెక్టర్‌ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: