మెగాస్టార్ చిరంజీవి కి తెలుగు చిత్రపరిశ్రమలో  ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా  దూసుకుపోయిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత రాజకీయాలకు వెళ్లి సినిమాలకు పూర్తిగా దూరమైన కొన్నేళ్ళకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆశించిన దానికంటే ఎక్కువగా దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్దన్నగ ... యువ హీరోల అందరికీ ఆదర్శంగా నిలుస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే గత సంవత్సరం సైరా నరసింహారెడ్డి అనే చారిత్రాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు  తన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 

 

 

 ఇక ఇప్పుడు సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. దేవాదాయశాఖ భూములను కాపాడే వ్యక్తి పాత్రలో ఈ సినిమాలో చిరంజీవి కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం కొరటాల చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ తర్వాత సినిమా ఏమిటనే దానిపై కూడా ప్రస్తుత స్పష్టత ఉంది . మోహన్ లాల్  ప్రధాన పాత్రలో నటించిన లూసిఫర్ చిత్రం ఎంత మంచి విజయాన్ని అందుకుందో  అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

 

 

 అయితే దీనికి దర్శకత్వం ఎవరు  వహించబోతున్నారు అన్నదానిపై కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు లూసిఫర్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కబోతున్నది  అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమా గురించి ప్రశ్న ఎదురవదా ఆసక్తికర సమాధానం చెప్పారు చిరంజీవి. తన కోసమే ఈ సినిమా రీమేక్ హక్కులను కొన్నట్లు తెలిపిన చిరంజీవి ఒకవేళ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి సినిమా చేయాలనే ఆసక్తి ఉంటే ఈ కథను తమ్ముడికి ఇచ్చేస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఓ వైపు పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా... ప్రస్తుతం వరుస సినిమాలతో కనీసం కాల్షీట్  కూడా కాళీ లేనంత   బిజీ ఉన్నారు ఈ నేపథ్యంలో లూసిఫర్ రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్  చేయట్లేదు  అని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: