కర్ణాటక రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తాజాగా కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. ఇక నేడు ఒక్క రోజే కర్ణాటక రాష్ట్రం మొత్తంగా 1227 కేసులు నమోదయ్యి రికార్డు సృష్టించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 13 వేల మార్క్ దాటి 13170 కు చేరుకుంది. ఇక మరోవైపు నేడు ఒక్క రోజు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి తేరుకొని 220 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7507 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.

 

 


ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5472 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రస్తుతం 243 మంది ఆరోగ్యం విషమించడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. అలాగే నేడు ఒక్క రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 మంది చనిపోయారు.

IHG

 

 

రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు కరోనా సోకి 207 మంది మరణించారు. నేడు ఒక్కరోజే బెంగళూర్ అర్బన్ జిల్లాలో 723 కేసులు నమోదవగా, బెంగళూరు రూరల్ జిల్లాలో 27 మంది కి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: