అనుమానం పెనుభూతం అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఏ విషయంలో అయినా అనుమానం ఉంది అంటే ఆ పని ముందుకు సాగదు... ఏ బంధం లో అయిన  అనుమానం దూరింది అంటే ఆ బంధం సక్రమంగా ముందుకు పోదు. ముఖ్యంగా భార్యా భర్తల బంధం అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండి  ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తల బంధం లో కి అనుమానం అనే పెనుభూతం దూరింది అంటే.. ఇక వారి మధ్య ప్రశాంతత కరువవుతుంది. అదే అనుమానం వారి మనసును తొలిచేస్తుంది. చివరికి ఆ అనుమానం దారుణాలు చేసేంతవరకు దారితీస్తూ ఉంటుంది,



 ఇక్కడ అనుమానం ఓ దారుణం ఘటనకు దారి తీసింది. అనుమానం సంసారంలో చిచ్చు పెట్టింది. అనుమానంతో ఓ భర్త అతి దారుణంగా భార్యను చంపిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... బుక్కపట్నం మండలం లోని కొత్తకోటకు చెందిన జయరామ్ లలిత దంపతులు తోటలో పనిచేసేందుకు మూడు రోజుల క్రితం తుంపర్తి కి వచ్చారు. లలిత తల్లిదండ్రులు గంగాద్రి కేశమ్మలు ఇదే తోటలో గత కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు. అయితే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో లలిత పై భర్త అనుమానం పెంచుకున్నాడు.



 ఇక అక్రమ సంబంధాలు అంటగట్టి భార్యను వేధించడం మొదలు పెట్టాడు భర్త. ఇదే విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి, ఇటీవలే తోట లో పనిచేస్తున్న సమయంలో భార్యభర్తలిద్దరు మద్య  గొడవ జరిగి మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త  జయరామ్ పక్కనే ఉన్న రోకలిబండతో భార్య తలపై విచక్షణ  రహితంగా కొట్టడం తో తీవ్ర రక్తస్రావమైంది లలిత అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది, లలిత  తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు నిందితుడు జయరామ్ ను  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: