నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు కు, విడదల రజిని కి అసలు పడదు.. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. వీరి మధ్య పోలీసులు నలిగిపోతూ ట్రాన్స్ఫర్ లు కూడా అయ్యారు.. అయితే ఇంకొన్ని ఫిర్యాదులు కూడా ఆమెపై జగన్ వద్దకు చేరాయి.. అయినా ఆమెను కనీసం మందలించలేదు జగన్.. దాంతో ఆమెకు ఎవరో పెద్ద తలకాయ హ్యాండ్ ఉందని తెలియకనే తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో ఆమెకు వైసీపీలోని సజ్జల రామకృష్ణారెడ్డి సహాయం చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది.
వాస్తవానికి రాజకీయాలు కొత్త. తొలుత టీడీపీలో చేరాలని అనుకుని.. అక్కడ సమీకరణలు కుదరకపోవడంతో వైసీపీలోకి వచ్చారు. ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి సహాయం చేశారట..అంతేకాదు చిలకలూరిపేట సీటు రేసులో ఉన్న మర్రి రాజశేఖర్ను బుజ్జగించి.. రజనీకి ఛాన్స్ ఇవ్వడంలో సజ్జల చక్రం తిప్పారని అంటున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆమె పేరు బాగా వినిపించింది. దీనిపై కనీసం విచారణ అయినా ఉంటుందని అంటున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఒక్క రజనీ విషయంలోనే సాధ్యమైందని.. దీని వెనుక బలమైన లాబీయింగ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు. ఏపీ రాజకీయాల్లో షాడో హోం మినిస్టర్గా వ్యవహరిస్తోన్న వ్యక్తే విడదల రజనీకి ఫుల్గా కోపరేట్ చేస్తున్నారన్న గుసగుసలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో తలపండిన సీనియర్ నేతలకు సైతం సాధ్యం కాని విధంగా ఆమె రాజకీయం ఉందని అంటున్నారు. ఆ షాడో మినిస్టర్ సపోర్ట్ లేనిదే ఇదంతా సాధ్యం కాదనే అంటున్నారు.