సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వం తో ఎంత సఖ్యతగా ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విధంగా వ్యవహరించడంపై తీవ్ర స్థాయిలో రాజకీయ వర్గాల్లో కూడా విమర్శలు వస్తున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇప్పుడే కేంద్రం పై విమర్శలు చేసే ఆలోచనలోనే ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం కాస్త కేంద్రంతో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్రానికి అన్యాయం చేయడంతో రాష్ట్రంలో సీఎం జగన్ కు మరింతగా మద్దతు పెరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం అన్యాయం చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఒక పక్కన రాష్ట్రం కష్టాల్లో ఉన్నా సరే ఇలా ఎలా చేస్తారని... పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా సీఎం జగన్ కు పరోక్షంగా మేలు చేకూర్చే అవకాశం ఉంటుందని రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆయన పోలవరం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్ళలేక పోతున్నారు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి సహాయం చేయకపోతే అది పరోక్షంగా సీఎం జగన్ కు రాజకీయంగా మేలు చేసే అవకాశాలు ఉంటాయి.