ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. సియస్ ఎన్నికల నిర్వహణ విషయంలో స్పష్టంగా వివరించిన నిమ్మగడ్డ రమేష్ పంథానికి వెళ్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు. ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్తామంటే ఉద్యోగులు సహకరించరని ఆయన స్పష్టత ఇచ్చారు. ఎన్నికలను నిర్వహించాలనే మీ పంతం కోసం ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం అడతారా అని నిలదీశారు. ఎన్నికల నిర్వహణ తరువాత అనేక రాష్ట్రాల్లో ఉద్యోగులు కరోన భారిన పడ్డారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 5లక్షల మంది ఉద్యోగులను పణంగా పెడతారా అని ప్రశ్నించారు. తెలంగాణ, బీహార్ లో ఎన్నికల తరువాత లక్షల మంది ఉద్యోగులకు కరోన సోకింది అని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం మొండి వైఖరి కి పోయి ఎన్నికలు నిర్వహిస్తే మేము ఎన్నికల ను బహిష్కరిస్తాం అని ఆయన హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించమని ఉద్యోగ సంఘాల ఏకగ్రీవ తీర్మానం చేశాయని అన్నారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలను నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసాయి అని చెప్పారు. ఎన్నికల కమిషన్ ను నిర్ణయంపై కోర్టును ఆశ్రయించ బోతున్నాం అని ఆయన స్పష్టం చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి