ఔను! ఇప్పుడు కాపు సామాజిక వ‌ర్గంలో ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లోని కాపు సామాజిక వ‌ర్గం రెండో మాట లేకుండా జ‌న‌సేన వైపు నిల‌బ‌డింది. దీనికి కార‌ణాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు వారికి అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం పవ‌న్‌కు ఏర్ప‌డింది. నిజానికి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జన‌సేన పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోలేదు. తాము బ‌లప‌ర‌చాల‌ని అనుకున్నా.. నాయ‌కులు క‌నిపించ‌ని దుస్థితిని పార్టీ ఎదుర్కొంది. ఈ నేప‌థ్యంలోనే యువ‌కులు ముందుకు రావాల‌ని.. తాము అండ‌గా ఉంటామ‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు.

అయితే.. ఎవ‌రు వ‌చ్చినా..రాకున్నా.. అప్ప‌టి కే నిల‌బ‌డిన వారు జ‌న‌సేన జెండాను భుజాన వేసుకున్నారు. ఇతర జిల్లాల్లో ఎలా ఉన్నా.. నెల్లూరు స‌హా ఉభ‌య గోదావ‌రి, కృష్నాలోని రెండు పంచాయ‌తీల్లో జ‌న‌సేన మ‌ద్ద‌తు  దారులుగా రంగంలోకి దిగిన‌.. వారు స‌త్తా చాటుకున్నారు. విజ‌యం సాధించారు. ఇక‌, నాలుగు ద‌శ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఫ‌లితాల‌ను విశ్లేషిస్తే.. జ‌న‌సేన అభ్య‌ర్థులు విజ‌యం సాధించిన పంచాయ‌తీల‌లో మెజారిటీ సామాజిక వ‌ర్గం కాపులే కావ‌డం గమ‌నార్హం. అంటే.. ప‌వ‌న్ వారికి ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌కపోయినా.. వారు మాత్రం పార్టీని ఓన్ చేసుకున్నారు.

కాపు సామాజిక వ‌ర్గానికి ప్ర‌స్తుతం చెప్పుకొనేందుకు ఏ పార్టీ లేదు. ఈ నేప‌థ్యంలో ఉన్న జ‌న‌సేన‌ను కూడా కాద‌నుకునే ప‌రిస్థితి లేద‌ని అర్ధ‌మైంది. కానీ.. ప‌వ‌న్ మాత్రం త‌న‌కు కులాల‌ను అంట‌గ‌ట్ట‌ద్ద‌ని చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం కాపులు పార్టీని గెలిపించారు. దీనిని బ‌ట్టి.. ప‌వ‌న్ ఇప్పుడు ట‌ర్న్ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల‌ప్పుడు ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు ప‌వ‌న్ విష‌యంలో కాపులు క్లారిటీ ఇచ్చార‌ని.. ఇక ఇప్పుడు .. ప‌వ‌న్ వారికి క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ప‌వ‌న్ మార‌తారో లేదో చూడాలి. 

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/ కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​

మరింత సమాచారం తెలుసుకోండి: