సాధారణంగా సినిమాలలో ఇలాంటి ఘటనలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. నదిలో ఎక్కడినుంచో ఒక చెక్క పెట్టె లేదా వస్తువు కొట్టుకు రావడం ఇక అందులో ఓకే చంటి బిడ్డ ఉండటం లాంటివి చూస్తూ ఉంటాం.  అయితే సినిమాలో ఇలాంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు నిజ జీవితంలో మాత్రం ఇలాంటివి జరగవేమో అనిపిస్తుంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే నదిలో ఒక చెక్క పెట్టె తీరానికి కొట్టుకొచ్చింది.


 అయితే స్థానికులు కాస్త భయం భయంగానే ఆ చెక్క పెట్టె అని తెరిచి చూశారూ. ఇంతలో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ చెక్కపెట్టె లో ఏకంగా ఒక పసికందు ఉంది. అంతేకాదు ఆ చెక్క పెట్టె లో అమ్మవారి ఫోటో కూడా ఉండటం గమనార్హం. ఇక ఇది కాస్త రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.  చెక్క పెట్టెలో ఎర్రటి వస్త్రము మీద చంటి బిడ్డతో పాటు దుర్గమ్మ ఫోటో కూడా ఉంది. వివరాల్లోకి వెళితే.. ఘాజీపూర్ లోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటి బిడ్డ ఏడుపులు వినిపించాయి.



 ఈ క్రమంలోనే పడవ నడిపే వ్యక్తులు కాసేపు భయాందోళనకు గురయ్యారు. ఇక అంతలోనే సమీపంలో ఒక చెక్క పెట్టె కొట్టుకు వస్తున్నట్లు కనిపించింది.  ఇక ఆ తర్వాత ఆ చెక్కపెట్టె నుంచే చంటి బిడ్డ ఏడుపులు వస్తున్నాయని గమనించారు. ఇక చక్కపెట్టె ని పట్టుకొని పడవలో పెట్టారు. ఇక ఆ తర్వాత అది తెరిచి చూసి షాక్ అయ్యారు. అందులో ముక్కుపచ్చలారని చంటి బిడ్డతో పాటు అమ్మవారి ఫోటో కూడా ఉంది.అంతే కాదు అందులో పేపర్ తో పాటు దానిపై ఆ చంటి బిడ్డకు గంగా అని పేరు పెట్టినట్లు రాసి ఉంది. అయితే ఇక పడవ నడుపుతున్న వ్యక్తి తన ఇంటికి చిన్నారిని తీసుకెళ్లి గంగమ్మ తనకు ఈ బిడ్డను ప్రసాదించిందని మురిసిపోయాడు. కానీ పోలీసులకు ఈ విషయం తెలియడంతో చంటి బిడ్డను  పెంచుకోవడం కుదరదు అంటూ తేల్చి చెప్పారు. చంటి బిడ్డ ఎలా కొట్టుకుంటు వచ్చింది అనేదానికి దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kid