టీడీపీ నేతలు, కార్యాలయాలపై చేపట్టిన దాడులకు నిరసనగా నేడు రాష్ట్రబంద్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోబంద్ ప్రభావం బాగా కనిపిస్తోంది. ఉదయం నుండే టీడీపీ శ్రేణులు రొడ్డు ఎక్కారు. అన్ని జిల్లాలలో వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేపడుతున్నారు. బస్సులను అడ్డకునేందుకు యత్నించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసన తెలుపుతున్నారు.
టీడీపీ నేతలు, పోలీసుల మధ్య కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అరెస్టులు చేపట్టారు. పోలీసులు ఆందోళన చేపడుతున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకొని అడ్డుకున్నారు. మరోవైపు పార్టీ ఆఫీస్ ఉద్యోగి బద్రి తలపై సుత్తితో దాడి చేశారు. దీంతో పోలీసులకు బద్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ నాయకులపై. పలువురు టీడీపీ నేతలపై కేసు నమోదైంది. అదేవిధంగా టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ నాయకులు 70 మందిపై కేసు నమోదు చేసినట్టు తాజాగా డీజీపీ వెల్లడించాడు. రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.