ఈ తరుణంలో ఈ నేపథ్యంలో...
వానలు, వరదలు ఆ నాలుగు జిల్లాలనూ అతలాకుతలం చేస్తున్నాయి. రాయలసీమలో కర్నూలు మినహా చిత్తూరు, అనంతపు రం, కడపతో పాటు నెల్లూరు కూడా జల ప్రళయంతో విలవిలలాడుతోంది. వానలకూ వరదలకూ ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయిన వారంతా తమను ఆదుకోమని నాయకులను వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నాయకులను ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుమారుడు ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నిన్నటి వేళ అడ్డుకున్నారు. తిరుపతి రూరల్ మండలం, పాత కాల్వ గ్రామస్థుల నుంచి ఆయనకు నిరసన సెగ ఎదురయింది. తమపై నమోదు చేసిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని వీరంతా కోరారు. ఇటీవల వరదలకు పేరూరు చెరువుకు గండి కొట్టొద్దని తాము విన్నవించుకు న్నా మీరు మా మాట వినకుండా గండి కొట్టారని, ఇదేమని అడిగితే మాపై కేసులు బనాయించారని ఆవేదన చెందుతూ నీట మునిగిన గ్రామాన్ని ఇప్పుడెందుకు సందర్శిస్తారని నిలదీస్తూ గ్రామస్థులు రోడ్డెక్కారు. దీంతో ఎంపీపీ చేసేది లేక చాలా సేపు పోలీసుల రక్షణలోనే ఉండిపోయారు. ఆఖరికి గ్రామస్థులకు క్షమాపణలు చెప్పి వెనుదిరిగారు.