తెనాలి యువతి గీతాంజలి  ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్ ప్రభుత్వంలో తమకు అమ్మఒడి, ఇంటిపట్టా లభించాయని ఆమె ఎంతో సంతోషంగా చెప్పిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో..టీడీపీ, జనసేనల పార్టీలకు చెందిన సోషల్ మీడియా జనాలు విపరీతంగా ట్రోల్ చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంటరయ్యారు.గీతాంజలి అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం.. అందుకు టీడీపీ, జనసేనలకు చెందిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వల్గర్ గా ఆమెను ట్రోలింగ్ చేశారని.. అవి భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఎన్నో విమర్శలు వెళ్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఘటన తనను ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.ఈ సందర్భంగా గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగినన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఆయన... ఆమె కుటుంబానికి మొత్తం రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని తెలిపారు.


ఈ సందర్భంగా... ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ నెల 4 వ తేదీన జరిగిన ఒక కార్యక్రమంలో "జగనన్న గృహనిర్మాణ పథకం" కింద ఇంటిస్థలం పొందడంతో వైసీపీ ప్రభుత్వాన్ని గీతాంజలి ప్రశంసించిన సంగతి తెలిసిందే. తనపేరు మీదే ఇంటిపట్టా వచ్చిందని.. తనకు చాలా ఆనందంగా ఉందని.. ఇప్పటికే తన పిల్లలకు "అమ్మఒడి" కూడా వస్తుందని ఆమె చాలా సంతోషంగా పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ గా మారాయి.దీంతో ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రాయలేని స్థాయిలో ఆమెపై దుర్భాషలాడుతూ, ఆమె క్యారెక్టర్ ని కించపరుస్తూ, ఆమెను పేటీఎం బ్యాచ్ అని విమర్శిస్తూ దారుణంగా ట్రోల్స్ చేశారు.దీంతో ఆ వేదింపులు భరించ లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: