
తమిళనాడులో ప్రజలు వివిధ భాషలు తెలిసినప్పటికీ తమిళంలోనే సంభాషిస్తారని, కానీ తెలంగాణలో ఆంగ్లంలో మాట్లాడేవారికి ఎక్కువ గౌరవం లభిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు అన్నారు. ఈ విషయం తన వ్యక్తిగత అనుభవంలో కూడా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్షలో తెలుగు మాధ్యమంలో జవాబు పత్రాలు రాసినవారికి తక్కువ మార్కులు వచ్చాయన్న ఆరోపణలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని ఆదేశించారు. మెయిన్స్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ, మార్కుల కేటాయింపు విధానాలపై వివరణాత్మక సమాచారం అందించాలని కోర్టు సూచించింది.
టీజీపీఎస్సీ తరపు న్యాయవాది పీఎస్ రాజశేఖర్ స్పందిస్తూ, గ్రూప్-1 పరీక్షలో వివరణాత్మక సమాధానాలు రాయాల్సి ఉంటుందని, అందుకే నిర్దిష్ట కీ లేకుండా సంబంధిత సబ్జెక్టుల నిపుణులచే మూల్యాంకనం జరుగుతుందని తెలిపారు. అయితే, మూల్యాంకనం చేసిన వ్యక్తుల వివరాలు తమ వద్ద ఉన్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు చెప్పడంపై టీజీపీఎస్సీ న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమాచారం బయటకు రావడం, మూల్యాంకనకర్తలను కోర్టుకు లాగడం వల్ల భవిష్యత్తులో వారు ఈ విధులు నిర్వహించడానికి భయపడే పరిస్థితి ఏర్పడవచ్చని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
94905 20108.. ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు