
కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గవర్నర్ ఆర్డినెన్స్ను ఆలస్యం చేసే అధికారం లేనప్పటికీ, రాష్ట్రం చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించారు. తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ఆలస్యం చేసిన బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలని ఆమె సూచించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, రాష్ట్రపతి నుంచి బిల్లుపై నిర్ణయం తీసుకునేలా చేయాలని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి తిరస్కరించినా, అసెంబ్లీ, మండలిలో మళ్లీ ఆమోదించితే గవర్నర్, రాష్ట్రపతి అనుమతి అవసరం ఉండదని కవిత స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దిల్లీలో నిర్వహించాలనుకుంటున్న ధర్నాను కవిత విమర్శించారు. ఈ ధర్నా బిహార్ ఎన్నికల కోసం నాటకమని, చిత్తశుద్ధి లేని చర్యగా ఆమె అభివర్ణించారు. ప్రభుత్వం నిజంగా బీసీ రిజర్వేషన్ కోసం కృషి చేయాలంటే, అన్ని పార్టీలను అధికారికంగా ఆహ్వానించి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ, వారు ఈ విషయంలో నోరు మెదపకపోవడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యం బీసీ సమాజానికి అన్యాయమని ఆమె తెలిపారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు