
ఈ పరిస్థితి రాష్ట్రంలో అత్యవసర హెచ్చరికలను అమలులోకి తెచ్చింది.జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, రేపు మధ్యాహ్నం నాటికి భారీ వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు గ్రామాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అధికారులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండి, పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
వరద నీటిలో బోట్లు, స్టీమర్లు ఉపయోగించరాదని, పంటల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ వరద ప్రవాహం రైతులకు, స్థానికులకు ఆర్థిక నష్టం కలిగించే అవకాశం ఉందని, అందుకే అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు