
ఈ విషయం అటు నిరుద్యోగులకు చాలా గొప్ప వరం లాంటిది. గతంలో రెండు ఎగ్జామ్లు రాసే పరిస్థితి ఏర్పడేది ఒకవేళ ఈ పద్ధతి గనుక అమలులోకి వస్తే ఒక్క ఎగ్జామ్ తోనే ఉద్యోగం సంపాదించవచ్చు. దీనివల్ల సమయం కూడా వృధా అవుతోందని ఏపీపీఎస్సీ తెలియజేసింది. ఈ ప్రతిపాదన ఆమోదిస్తే చాలు ఏపీపీఎస్సీ నుంచి భర్తీ చేసి ఉద్యోగాలలో చాలా వాటికి ఒక్క పరీక్ష మాత్రమే నిర్వహించే అవకాశం ఉన్నది. తక్కువ సమయంలోనే ఎక్కువ ఉద్యోగాలను సైతం భర్తీ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం వల్ల నిరుద్యోగులకు కూడా ప్రయోజనం కలుగుతుంది.
ఈ విషయంపై అటు ప్రభుత్వం పైన కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు నిరుద్యోగులు. వీటివల్ల పోస్టులను కూడా భర్తీ త్వరగా చేసే అవకాశం ఉంటుందని నిరుద్యోగులు కూడా తెలియజేస్తున్నారు. మరి ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ అధికారికంగా ఈ విషయంపైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇప్పటికే ఏపీపీఎస్సీ నుంచి పలు రకాలు ఉద్యోగాల నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.