ఈ రోజున పులివెందల, ఒంటిమిట్ట ప్రాంతంలో జడ్పిటిసి ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దీంతో ఎవరు గెలుస్తారని విషయం పై చాలా ఉత్కంఠమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనని గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఇంటి వద్ద భారీగానే పోలీసులు మోహరించారు. అయితే ఈ విషయాన్ని తప్పు పడుతూ తన ఇంటి వద్ద నిరసనకు దిగారు అవినాష్ రెడ్డి.. అంతేకాకుండా వైసీపీ శ్రేణులు కూడా భారీగా తరలి రావడంతో మరింత పరిస్థితులు ఉద్రిక్తంగా మారిందట.


దీంతో పోలీసులు చేసేదేమీ లేక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు సమాచారం. ముఖ్యంగా ఎన్నికలు జరిపే విధానం పైన అవినాష్ రెడ్డి ప్రశ్నించగా తమ కార్యకర్తల పైన టిడిపి నేతలు దాడి చేస్తున్నారని,కేవలం టిడిపి వారు వైసీపీ ఏజెంట్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు.  పోలీసులు చేస్తున్న తీరును కూడా తప్పు పట్టడం జరిగింది.. దాడులు జరగకుండా ఆపాల్సిన పోలీసులు తనని అడ్డుకుంటున్నారని ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరి ఎప్పుడూ చూడలేదంటూ పోలీసులు తీరు పైన ఫైర్ అయ్యారు అవినాష్ రెడ్డి.


ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు జరగబోతోంది. అలాగే 14వ తేదీన ఉదయం 8 గంటలకు ఈ ఓట్లను లెక్కేస్తారు. పులివెందుల ,ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. పులివెందులలో 10,601 ఓటర్లు ఉండగా 15 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. అక్కడ వైసిపి ,టిడిపి అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నది.

అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ కు 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ 24,606 ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగానే బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరి ఫలితాల రోజున ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: