ఇక ఇవన్నీ అవినీతి డబ్బులతో కూడుకున్నవేనని నిర్ధారించడంతో.. ఏసీబీ కోర్టులో వాటిని జప్తు చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు .ఇది మొదటి అడుగు మాత్రమే. విచారణలో బయటపడ్డ ఇతర నిందితుల ఆస్తులపైనా ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకోబోతోంది. కొందరు నిందితులు హైదరాబాద్లో లగ్జరీ విల్లాలు, ఇళ్ల స్థలాలు, ఫామ్ హౌస్లు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు కనుగొన్నారు. ఇప్పటికే ఒక ఫామ్ హౌస్లో దాచిపెట్టిన రూ.11 కోట్ల నగదు స్వాధీనం కావడం కేసును మరింత సీరియస్ దశకు తీసుకెళ్లింది . ఇక చట్టపరమైన ప్రక్రియలో భాగంగా రెండు చార్జిషీట్లు ఇప్పటికే కోర్టులో దాఖలయ్యాయి. కానీ ఇక్కడితో ఆగిపోవడం లేదు.
ఈ మొత్తం స్కామ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు? ఆయన దక్కించుకున్న నగదు, బంగారం, ఆస్తులు అన్నీ బయటకు తీయాల్సి ఉంది. సిట్ దగ్గర ఈ విషయాలపై పక్కా సమాచారం ఉందని చెబుతున్నారు. సరైన సమయం వచ్చేసరికి ఈ రహస్యాలను ఒక్కొక్కటిగా బయటపెట్టి.. అసలు లబ్ధిదారులను బహిర్గతం చేసి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రజల రక్తమాంసాలు పీల్చుకుంటూ వచ్చిన ఈ లిక్కర్ మాఫియా ఇప్పుడు ఒక్కో అడుగుతో కూలిపోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కేసు తుది దశలోకి వెళ్ళేసరికి ఏపీ రాజకీయాల్లో పెద్ద తుపాన్ రాబోతుందనే అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి