
ఈ హత్య కేసులో పూనమ్ దేవి, ఆమె ప్రియుడు మహేశ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ జంట బిహార్ నుంచి వచ్చి, గత నెలలో సమా రూపేష్ రెడ్డి యాజమాన్యంలోని డెయిరీ ఫామ్లో పని ప్రారంభించారు. హత్య తర్వాత ఇద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫామ్ యజమాని రూపేష్ రెడ్డి ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
పూనమ్ గతంలో మహేశ్ను వివాహం చేసుకుని, ఆ తర్వాత రాకేశ్తో రెండో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. మహేశ్ రెండు రోజుల క్రితం డెయిరీ ఫామ్కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో రాకేశ్ను హత్య చేసి, మృతదేహాన్ని బావిలో పడేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితులిద్దరూ పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.మొయినాబాద్ ఇన్స్పెక్టర్ జి. పవన్ కుమార్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బిహార్ నుంచి వచ్చిన ఈ దంపతుల వివాహ జీవితంలోని సంక్లిష్టతలు, పూనమ్ గత సంబంధాలు ఈ హత్యకు కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు