మీడియా ముందు కొంతమంది నాయకులు నోటి మాటలు మాట్లాడినా.. తరువాత మౌనం వహించడం కూడా జగన్కు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన పరిణామం వైసీపీలో ఇంటర్నల్ ఉద్రిక్తతలను బహిరంగం చేసింది. రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కో ఆర్డినేటర్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని వ్యతిరేకిస్తూ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 50 మంది మాజీ ప్రజాప్రతినిధులు లేఖపై సంతకాలు చేశారు. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్తో లేఖను ఎక్స్లో పోస్టు చేయడం సంచలనంగా మారింది. అయితే ఆ లేఖను కొద్ది సేపట్లోనే తొలగించారు. ఈ పరిణామంపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలను బహిరంగ వేదికలపై ప్రదర్శించడం సరైంది కాదని ఆయన భావిస్తున్నారు.
గత నాలుగేళ్లుగా పార్టీ కార్యకలాపాలన్నీ సజ్జల ఆధ్వర్యంలోనే నడిచాయి. ఆయన సూచనలు, సలహాలు ఎక్కువగా అమలవుతుండటంపై చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. గడచిన ఎన్నికల్లో పార్టీకి దెబ్బ తగలనడానికి కారణం కూడా ఆయన వ్యూహాలే అన్న అభిప్రాయం కొంతమంది నేతల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే 50 మంది మాజీ నేతలు కలిసి ఆయనను తప్పించాలనే డిమాండ్ చేయడం పెద్ద దుమారం రేపింది. మొత్తం మీద ఈ లేఖ వ్యవహారం జగన్ నాయకత్వంపై, అలాగే పార్టీ భవిష్యత్తుపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఇప్పటికే ప్రజలతో సంబంధాలు బలహీనంగా ఉన్న తరుణంలో.. ఇలాంటి లోపలి గొడవలు వైసీపీకి మరింత కష్టాలను తెచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యను జగన్ ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి